ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ మాతృ సంస్థ మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందంటూ మెటా సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. దీనిలో మార్క్ జుకర్బర్గ్ ప్రమాదకరమైన జీవనశైలిని అనుసరిస్తారని, ఇది అతనికి ప్రాణాంతకంగా మారిందని పేర్కొన్నారు.మెటా సంస్థ ప్రతి సంవత్సరం తన వార్షిక నివేదికను అందజేస్తుంది. ఈసారి కంపెనీ తన వార్షిక నివేదికలో అలాంటిదే చెప్పడం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది ఈ కార్యకలాపాలలో తీవ్రమైన గాయాలు, మరణాలు సంభవించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సోషల్ మీడియా దిగ్గజం దాని వ్యవస్థాపకుడు పోటీ పోరాటాలను ఇష్టపడతారని, దాని కారణంగా అతను గత సంవత్సరం గాయంతో బాధపడుతున్నాడు.