ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ, జనసేన 10 నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. గుడివాడ, పామర్రులో మాత్రం కొత్త అభ్యర్థులకు టికెట్ ఇచ్చారు. మచిలీపట్నం, నందిగామతో సహా ఐదు స్థానాల్లో పాతవరికే మరో అవకాశం ఇచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేనకు కేటాయించారు. మైలవరం, పెనమలూరు నియోజకవర్గాలపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు.మచిలీపట్నం నుంచి కొల్లు రవీంద్ర, గుడివాడ నుంచి వెనిగండ్ల రాము, గన్నవరం నుంచి యార్లగడ్డ వెంకట్రావు, పామర్రు నుంచి వర్ల కుమార్ రాజా, విజయవాడ తూర్పు నుంచి గద్దె రామ్మోహన్, విజయవాడ సెంట్రల్ బోండా ఉమా,నందిగామ తంగిరాల సౌమ్య, జగ్గయ్య పేట నుంచి శ్రీరామ్ తాతయ్య, నూజివీడు నుంచి కొలుసు పార్థసారథిలను ప్రకటించారు.