టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా గురించి తెలియనివారు ఎవరూ ఉండరు.మూగ జీవాలంటే ఆయనకు ఎంతో ప్రేమ ఉంది. వాటి కోసం ‘టాటా ట్రస్ట్స్ స్మాల్ యానిమల్ హస్పిటల్’ అనే పేరుతో ఆస్పత్రిని సుమారు 2.2 ఎకరాల విస్తీర్ణంలో రూ.165 కోట్లతో నిర్మిస్తున్నారు. ఇది భారతదేశంలోనే అతి పెద్ద జంతు వైద్యశాలగా మార్చి నెలలో ప్రారంభం కానుంది. ఈ ఆస్పత్రి కుక్కులు, పిల్లులు, కుందేళ్లు వంటి ఇతర చిన్న జంతువులకు 24 గంటలు వైద్య సేవలను అందించనుంది.‘‘పెంపుడు జంతువులను కుటుంబ సభ్యులుగా భావిస్తాను. నా జీవితం అనేక పెంపుడు జంతువుల మధ్య సాగింది. ఒక సంరక్షకుడిగా వాటికి ఆస్పత్రి అవసరం అని గుర్తించాను. అందుకే ఈ వైద్యశాలను నిర్మిస్తున్నా.’’ అంటున్నారు రతన్ టాటా..